calender_icon.png 12 October, 2024 | 7:53 AM

క్వార్టర్స్‌లో అల్కరాజ్

10-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ టెన్ని స్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిన్నర్ 6-4, 7-6 (7/1) తేడాతో బెన్ షెల్టన్ (అమెరికా)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్‌లో అల్కరాజ్ 6-4, 7-5తో గల్ మొన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. ఇక 5వ సీడ్ మెద్వెదెవ్ 7-6 (7/3), 6-3 తేడాతో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపును అందు కున్నాడు. మరో మ్యాచ్‌లో జొకోవిచ్ ముందంజ వేశాడు.