- వింబుల్డన్ గ్రాండ్స్లామ్
ఒసాకా, పవోలిని ముందంజ
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలిరోజు పెద్దగా సంచలనాలు నమోదు కాలేదు. పురుషుల సింగిల్స్లో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్కు దూసుకెళ్లగా.. మెద్వెదెవ్, రూడ్ ఎలాంటి అడ్డంకి లేకుండా తొలి రౌండ్ను అధిగమించారు. మహిళల సింగిల్స్లో నవోమి ఒసాకా, మాడిసన్ కీస్, జాస్మిన్ పవోలినిలు శుభారంభం చేశారు. భుజం గాయంతో సబలెంకా టోర్నీ నుంచి వైదొలిగింది.
లండన్: సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అల్కరాజ్ 7 (7/3), 7 6 లాజల్ (ఎస్తోనియా)పై విజయం సాధించాడు. తొలి సెట్ను టై బ్రేక్లో నెగ్గిన అల్కరాజ్ తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. ఇతర మ్యాచ్ల్లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6 6 6 అలెగ్జాండర్ కొవాసెవిక్ (అమెరికా)ను చిత్తు చేశాడు. నిరుడు వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్పై గెలిచి తొలిసారి టైటిల్ గెలిచిన అల్కరాజ్ ఈ ఏడాది కూడా శుభారంభం చేశాడు.
డెన్మార్క్కు చెందిన కాస్పర్ రూడ్ 7 6 6 బోల్ట్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్లో జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఒసాకా 6 1 6 డియానె పర్రీ (ఫ్రాన్స్)ను చిత్తు చేసింది. మరో సింగిల్స్లో జాస్మిన్ పవోలిని (ఇటలీ) 7 6 స్పెయిన్కు చెందిన సోరిబెస్ టొర్మోను ఓడించింది. మాడిసన్ కీస్ (అమెరికా) 6 7 (7/4)తో ట్రెవిసన్ (ఇటలీ)పై విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టింది.