calender_icon.png 16 March, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫాయి కార్మికుడికి ఆర్థిక సాయం అందించిన అయిత పరంజ్యోతి

16-03-2025 06:21:53 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణానికి చెందిన మేజర్ గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు ఎర్ర రమేష్ (32) అనారోగ్యంతో రాత్రి మరణించాడు, విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు పరంజ్యోతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో  శ్రీనివాస్ ఎర్ర యాదగిరి, బక్క దశరథం, నాగరాజు, సాయిబాబా, పొట్టి గణేష్, దుర్గయ్య, మైసయ్య, చంద్రయ్య, బాలు, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.