16-03-2025 11:44:45 AM
సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్
రాజేంద్రనగర్: ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏటీసీ అధికారులు సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారుల కథనం ప్రకారం... కౌలాలంపూర్ నుంచి 73 మంది ప్రయాణికులతో ఎయిర్ ఏషియా విమానం హైదరాబాద్ బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోకి రాగానే విమానం గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే ఈ విషయం గమనించిన పైలెట్ శంషాబాద్ విమానాశ్రయం ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఎయిర్ ఏషియా విమానాన్ని సురక్షితంగా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.