చెన్నై,(విజయక్రాంతి): తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన ఎయిర్ షోలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మెగా ఎయిర్ షో ప్రారంభమైంది. దీంతో ప్రదర్శనను తిలకించేందుకు సందర్శకులు తరలివచ్చారు. సందర్శకులు తిరుగు ప్రయాణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. పలువురు సందర్శకులు కిందపడడంతో ఊపిరాడక ముగ్గురు సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందగా.. అస్వస్థతకు గురైన మరో 230 మందిని చెన్నైలోని మూడు ఆసుపత్రులకు తరలించారు. మెగా ఎయిర్ షోకు దాదాపు 13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు అధికారుల అంచనా.