కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరిన ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ విన్నవించారు. గురువారం ఢిల్లీలో రాజ్నాథ్సింగ్ను ఎమ్మెల్యే పాయల్శంకర్తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రక్షణ శాఖకు చెందిన 369 ఎకరాల భూమి ఉన్నదని, దానికి అదనంగా రాష్ర్ట ప్రభుతం మరో 1,592 ఎకరాల భూమిని గుర్తించిందని తెలిపారు. గత ప్రభుతం భూమిని సేకరించినా ఇవడానికి సుముఖత వ్యక్తం చేయలేదని, ప్రస్తుత ప్రభుతం కేంద్రానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి, పూర్తి వివరాలు తెలపాలని అధికారులను ఆదేశించారని ఎంపీ పేర్కొన్నారు.