జయంతి కార్యక్రమాల్లో వక్తలు
విజయక్రాంతి న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 26: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. మెదక్ కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి మంత్రి కొండా సురేఖ పూలమాల వేసి నివాళులర్పించారు.