బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మచూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐల మ్మ త్యాగాలకు గుర్తుగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించినట్లు గుర్తుచేసుకున్నారు. భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలపాలని పాఠ్యాంశంగా రూపొందించిందన్నారు. కార్యక్ర మంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, దేవీప్రసాద్, బాల్క సుమన్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.