విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీవో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: అగ్ని బాలిస్టిక్ మిస్సైల్ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అన్ని రకాల సాంకేతిక పారామితులను చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రయో గించారు. ఈ క్షిపణి 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. 20 మీటర్ల పొడవు ఉండే ఈ మిస్సైల్ 1,000 కిలోల పేలోడ్ను మోసుకెళుతుందని అధికారులు వెల్లడించారు. అగ్నిప మిస్సైల్ను గతంలో అగ్ని ప్రైమ్గా వ్యవహరించేవారు. దీన్ని అగ్ని తో పాటు దేశీయంగా డీఆర్డీవో అభివృద్ధి చేసింది.