calender_icon.png 26 October, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభవన్‌లో గురుకుల అభ్యర్థుల ఆందోళన

26-10-2024 12:28:21 AM

బ్యాక్‌లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): బ్యాక్‌లాగ్ పోస్టులను అర్హులతో నింపాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై శుక్రవారం ప్రజాభవన్‌లో ఆందోళన చేపట్టారు. గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే గురుకులాల్లో ఖాళీలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ నియామకాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్‌లా గ్ పోస్టులు మిగిలిపోయాయని, వాటిని వెంటనే అర్హులైన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాం డ్ చేశారు. పరీక్ష రాసి మెరిట్ తెచ్చుకొని అర్హత ఉన్నా తమకు ఉద్యోగా లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.