పలువురి అరెస్ట్.. స్టేషన్కు తరలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): గ్రూప్-1మెయిన్స్ పరీక్షలను ఈ నెల 21 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ గ్రూప్-1 అభ్యర్థులు అశోక్నగర్లో మరోసారి నిరసన తెలిపారు. గురువారం గాంధీనగర్ పార్క్లో నిరసన తెలిపిన అభ్యర్థులు.. జీవో 29ని వెంటనే రద్దు చేయాలని, తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దాదాపు 30 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. గతంలో జరిగిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు దొర్లాయని, వాటిని నివృత్తి చేశాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కోరారు.
పరీక్షలను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి కోరినట్లు తెలిపారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో అశోక్నగర్ జంక్షన్, చిక్కడపల్లి లైబ్రరీ వద్ద పోలీసు బలగాలను మోహరించారు.