టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది చివరిసారి ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆనారోగ్యం కారణంగా చాలా కాలంపాటు నటనకు దూరంగా ఉంటూ వచ్చింది. సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లోనే కాకుండా ఓటీటీలోనూ ప్రవేశించిన ఆమె ‘సిటిడెల్: హనీ బన్నీ’ విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, సమంత మరో వెబ్ సిరీస్లో నటించనున్నట్టు తాజాగా తానే ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. హిందీలో ‘రక్త బ్రహ్మాండ్’ పేరుతో ప్రముఖ ఓటీటీ, సినీ నిర్మాణ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ను నిర్మించనుంది. బాలీవుడ్ నటీనటులు వామికా గబ్బి, ‘మిర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా భాగం కానున్నారు. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నట్టు సమాచారం. హిందీలో ‘తుంబాడ్’ను తెరకెక్కించిన రాహీ అనిల్ బ్రేవ్, రాజ్ తదితరులు దీనికి దర్శకత్వం వహించనున్నారు.