బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది ఆయన ప్రేయసి, నటి రియా చక్రవర్తి. ఈ క్రమం లో కోర్టులు, జైలు వంటి ఊహించని పరిణమాలను చవిచూసింది. నటనకు సైతం దూరమైన ఆమె, ఈ కేసులో తను పడిన కష్టాలతో పాటు ప్రస్తుతం ఎలా జీవనం సాగిస్తున్నది వంటి విషయాలను ఓ పాడ్కాస్ట్ ద్వారా బయటపెట్టింది. “సుశాంత్ మరణానం తరం డబ్బు దోచుకున్నానని, చేతబడి చేశానని, డ్రగ్స్ అందించానని అతని కుటుంబ సభ్యులు నాపై అనేక విమర్శలు చేస్తూ కేసులు పెట్టారు. అయితే నిజానిజాలు తెలియని వారే ఇలా విమర్శించారని చెబుతూ.. దాని కారణంగా తాను అనుభవించిన బాధ ఎవ్వరికీ తెలియదన్న ఆమె, ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్గా కొనసాగుతున్నట్టు తెలియజేసింది. దీనిని తన జీవితంలో రెండో చాప్టర్గా భావిస్తున్నానం టున్న రియా, సినిమాలకు దూరమయ్యాక ఇదే తన జీవనాధారంగా బతుకుతున్నా” అన్నారు. ‘తూనీగ తూనీగ’ అనే తెలుగు చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపె ట్టిన రియా తరువాత ‘ మేరే డాడ్కి మారుతి’, ‘ సోనాలీ కేబుల్’, ‘బ్యాంక్ చోర్’ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.