calender_icon.png 17 April, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు కలకలం

08-04-2025 04:30:21 PM

చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులు..

బాధితులను ఆస్పత్రిలో పరమార్శించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి...

కామారెడ్డి/బాన్సువాడ (విజయక్రాంతి): జిల్లా వైద్య శాఖ అధికారి చంద్రశేఖర్ లు బాధితులను మంగళవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్తీకల్లు విక్రయించిన దుకాణాలను సీజ్ చేశారు. కల్లు దుకాణాల నిర్వ హాకులపై కేసులు నమోదు చేశారు. పొద్దంతా కష్టపడి కూలి నాలి చేసుకునే బడుగు బలహీన పేద ప్రజలు సాయంత్రం వేళలో కల్లు సేవించి తాము పడిన కష్టాన్ని మరిచిపోయేందుకు సేద కల్లు సేవించి సేద తీరుతారు.

అమాయకుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని మత్తు మందు కలిపి కల్తీకల్లు విక్రయాలు

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు అమాయకుల పేద ప్రజల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కల్తీకల్లు అంటగాడుతున్నారు. కల్తీకల్లు సేవిస్తున్న పేద ప్రజలు అమాయకులు కల్తీ కల్లుకు అడాప్ట్ అవుతున్నారు. కల్లు సేవించిన తర్వాత వారు ఏమి చేస్తారో వారికే తెలియకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దాడులకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు కల్తీకల్లులో మద్యం కలుపుకొని సేవిస్తున్నారు. ఈ విషయాలన్నీ చూసిన వస్తే దారులు తమకు గిరాకి వస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కల్లులో ఏ మేరకు మత్తు పదార్థాలు కలుపాలని విషయం కూడా తెలియకుండానే కల్తీకల్లు తయారు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వెలుగు చూశాయి.

80 మందికి పైగా అస్వస్థత

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్, మండలంలోని దుర్గి అంకోల్ తండా తదితర గ్రామాల్లో కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురైన విషయం విధితమే. నాలుగు గ్రామాలకు చెందిన 80 మంది పైగా యువకులు వృద్ధులు చిన్నారులు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు.