calender_icon.png 26 October, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎంఎల్ఏల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

08-07-2024 03:32:11 PM

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎంఎల్ఏల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నగేందర్, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

పార్టీ మారిన ఎంఎల్ఏల అనర్హత ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వీకర్ కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎంఎల్ఏలపై 3 నెలల్లోనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు తీర్పును స్వీకర్ అమలు చేయడం లేదని పిటిషనర్లు వెల్లడించారు.