రాజేంద్రనగర్,సెప్టెంబర్30: జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు నార్సింగి పోలీసులు అతడిపై అత్యాచారం, పోక్సో కేసు నమో దు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ను అరెస్టు చేసిన పోలీసులు సెప్టెంబర్ 19న రిమాండ్కు తరలించారు.
ఇటీవల అతడి కస్టడీ పూర్తవడంతో కోర్టు మరోసారి పొడిగించింది. ఈ క్రమం లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ జానీ మాస్టర్ తరఫున న్యాయవాది రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై విచారణ ను అక్టోబర్ 7కు వాయిదా వేశారు.