21న కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న కోర్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల కేటీఆర్ విచారణకు హాజరు కాలేకపోయారని, సోమవారం వరకు సమయం కావాలని కేటీఆర్ తరఫు లాయర్ కోర్టును అభ్యర్థించారు.
కాగా, శుక్రవారం వాంగ్మూ లం తీసుకుంటామని చెప్పినా మళ్లీ సమ యం ఎలా కోరుతారని లాయర్ను కోర్టు ప్రశ్నించింది. అనంతరం సోమవారం కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని వెల్లడించింది. కాగా, గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా సురేఖ తన పై వివాదాస్పద వ్యాఖ్య లు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారం టూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
ఈ పిటిషన్పై ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో కోర్టుకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా రాలేదు. దీంతో ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు.