02-03-2025 07:46:02 PM
చెన్నూర్ (విజయక్రాంతి): జైపూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న భోజన మెను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మోతిలాల్ ఎస్సీ బాలుర హాస్టల్ ను తనిఖీ చేశారు. రాత్రి హాస్టల్లో వండిన భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కలిసి డిన్నర్ చేశారు. విద్యార్థులను సబ్జెక్టుల వారిగా ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టులలో ఉన్న అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వయంగా బోధన చేశారు.