11-12-2024 01:50:38 AM
* మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ డిమాండ్
మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): అదానీ గ్రూప్ అవినీతి అంశం పై పార్లమెంట్లో చర్చించాలని పార్లమెంట్ ఆవరణంలో ఇండియా కూటమి నేతలతో కలిసి మహబూబాబాద్ ఎంపీ పొరిక బల రాం నాయక్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అదానీ ఒకటే అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడు తూ.. దేశంలో మోదీ, -అదాని రాజ్యం నడుస్తుందని విమర్శించారు.