calender_icon.png 22 September, 2024 | 6:01 AM

ఆంధ్రప్రదేశ్‌కు అదానీ గ్రూప్ భారీ విరాళం

19-09-2024 04:09:06 PM

అమరావతి,(విజయక్రాంతి): గత కొన్నిరోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకోవడానికి కొంతమంది ప్రముఖులు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ కు భారీ విరాళం అందించింది. వరద బాధితుల సహాయార్థం అదానీ గ్రూప్ రూ.25 కోట్లు విరాళం చెక్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ గురువారం అందజేశారు. అదానీ ఫౌండేషన్ ద్వారా విరాళం అందజేసిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.