17-04-2025 01:07:18 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: సినీ నటి కుషిత సందడి చేశారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీలో ఏర్పాటుచేసిన మినర్వా స్వీట్స్ షాపు ను ఆమె బుధవారం పలువురు మోడ ల్స్తో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..
తాము మూడో అవుట్లైట్ను ప్రారంభించామని వినియోగదారులకు నాణ్య మైన స్వీట్లు స్నాక్స్ అందజేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ఎమ్మె ల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటి కుషిత పలువురు మోడల్స్ సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.