calender_icon.png 5 October, 2024 | 1:05 PM

రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. కూతురు మృతి

05-10-2024 10:18:55 AM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ కు కూతురు గాయత్రితోపాటు కుమారుడు ఉన్నారు. కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. గాయత్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.