పాడె మోసిన ఎమ్మెల్యే వీరేశం
నల్లగొండ, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి ఆదివారం మృతి చెందారు. ఉదయం నెల్లిబడ్డ స్టేజీ సమీపంలో వ్యవసా య బావి వద్దకు వెళ్లిన ఆయనను పాముకా టు వేసింది. చికిత్స నిమిత్తం నకిరేకల్కు తరలిస్తుండగా గుండెపోటుతో అప్పటికే తుది శ్వాస విడిచారు. సాయంత్రం కటుంబీకులు లింగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే వీరేశం, చెరుకు సుధాకర్తోపాటు పలువురు ఉద్యమకారులు అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.