calender_icon.png 3 April, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్, ఆన్‌లైైన్ గేమ్‌లకు పాల్పడితే చర్యలు

02-04-2025 12:25:54 AM

  • యువత  ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు 

జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

మెదక్, ఏప్రిల్ 1(విజయక్రాంతి):యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కారడ్స్, గేమింగ్ యాప్లకు, ఐపీఎల్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న  భ్రమలో యువత, ప్రజలు, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ లకు బానిసలుగా మారి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని ఆన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, ప్లే కార్డ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ముఖ్యంగా  ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని బెట్టింగ్ లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని ప్రతి రోజూ పిల్లలు వారు చేస్తున్న పనుల గురించి ఆరా తీయాలని తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల నిర్వహకుల మార్గదర్శకంలోనే బెట్టింగ్ లు ఆపరేట్ చేయబడతాయన్నారు.

నిషేధిత యాప్ ల డౌన్ లోడ్ ద్వారా ప్రజల  వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉన్నందన్నారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం  అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.