calender_icon.png 28 September, 2024 | 4:52 AM

టీచర్లపై చర్యలు తీసుకోవాలి

28-09-2024 01:02:16 AM

నిర్మల్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో క్రిప్టో బిట్‌కాయిన్ దందాలో భా గస్వాములైన ప్రభుత్వ ఉపాధ్యాయులపై విచారణ జరిపి కఠినంగా శిక్షిం చాలని టీజీవీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశా రు. శుక్రవారం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఉన్నతాధికారుల పాత్ర కూడా బయట పడుతుందన్నారు. విద్యాధికారి పర్యవేక్షణ లోపంతోనే ఉపాధ్యాయులు క్రిప్టో వ్యాపారం చేసి పోలీసులకు చిక్కారని ఆరోపించారు.