calender_icon.png 8 October, 2024 | 5:44 PM

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మద్యం దుకాణదారులపై చర్యలు తీసుకోవాలి

08-10-2024 01:25:13 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి):  బెల్లంపల్లి నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మద్యం దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట పవన్ కుమార్, చెన్నూరు నాయకులు ముల్కల రాజేంద్రప్రసాద్ లు సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ ఇంద్రప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూములను కేటాయించినప్పటికీ మద్యం దుకాణదారులు వాటర్ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లు, నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు అధిక ధరలకు యదేచ్ఛగా అమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే మద్యం మద్యం దుకాణదారులు కొనసాగిస్తున్న ఈ వ్యాపారాన్ని నిలుపుదల చేయించాలని వారు సీఐ కి అందజేసిన వినతి పత్రంలో కోరారు.