22-01-2025 12:35:04 AM
సైబరాబాద్ కమిషనరేట్లో సినీనటి మాధవీలత ఫిర్యాదు
శేరిలింగంపల్లి ,జనవరి 21 : నచ్చావులే, స్నేహితుడా చిత్రాల ఫేం సినీనటి,బీజేపీ నాయకురాలు మాధవీలతపై తెలుగుదేశం సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మాధవీలత సైబరాబాద్ కమిషనరేట్లో మంగళవారం జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
తనను అసభ్య పదజాలంతో దూషించి, తన పరువుకు భంగం కలిగించారంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మాధవీలత ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా తాను సైబరాబాద్ కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నానని,అందుకే జేసీ చేసిన వ్యాఖ్యలపై సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.