calender_icon.png 20 October, 2024 | 9:28 AM

అఅక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

20-10-2024 12:26:51 AM

పెద్దపల్లి అదనపు 

కలెక్టర్‌కు వినతి 

మంథని, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మంథని పట్టణ శివారు లోని గౌడ్స్, పద్మశాలీ ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయా కులస్థుల బాధితులు కోరారు. శనివారం పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీకి, మంథని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ మార్గంలో ప్లాట్టు పొందిన వారిని గుర్తించి వాటిని రద్దు చేసి అర్హులైన నిరు పేదలకు కేటాయించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. వినతిపత్ర అందజేసిన వారిలో సూరయ్యపల్లి మాజీ వార్డ్ మెంబర్ అరల్లి కిరణ్‌గౌడ్, విద్యార్థి జేఏసీ నాయకులు బెజ్జంకి డిగంబర్, నాయకులు బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.