29-04-2025 10:02:41 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చలామణి అవుతున్న నకిలీ విలేకరులపై సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్(Mancherial DCP Bhaskar) లకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీలకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి విలేకరుల దృశ్చర్యలపై వివరించారు. బెల్లంపల్లి పట్టణంలో రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఉండగా, మరో ప్రెస్ క్లబ్ ను చెలామణి చేస్తూ కొందరు వ్యక్తులు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన సీపీ, డీసీపీ లు నకిలీ విలేకరులపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. విలేకరుల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్ల కు పాల్పడితే వారిని గుర్తించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అట్టి వారిపై తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.