పోలీసులు చోద్యం చూస్తున్నరు
మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి డిమాం డ్ చేశారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కాం గ్రెస్ పార్టీ దాడులపై గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కౌశిక్రెడ్డి, సంజయ్, ఆర్. ఎస్. ప్రవీణ్కుమార్తో కలిసి డీజీపీకి ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీశ్రావుపై దాడి జరిగితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మె ల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఎ మ్మెల్యే గాంధీపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాంగ్రె స్ నాయకులు పుట్టినరోజు వేడుకలు పోలీసుస్టేషన్లో జరుపుకునే దౌర్భాగ్యం కాంగ్రెస్ పాలనలో నడుస్తోందని విమర్శించారు.