కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు హరీశ్రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికార దుర్విని యోగంతో దుర్మార్గ, దుష్ట పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమ ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో బుల్డోజర్ రాజ్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి హరీశ్రావు సోమవారం బహిరంగ లేఖ లేశారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్ ప్రతీకగా మారిందని, అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోందని ఆరోపించారు. హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నో ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బుల్డోజర్లను రహదారులు నిర్మించేందుకు ఉపయోగించేవారని.. జాతీ య పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వాటిని నిర్మాణాలను కూల్చేందుకు ఉపయోగించడం దుర్మార్గమన్నారు.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మహారాష్ర్టలో పేదలు, మధ్య తరగతిపై బీజేపీ బుల్డోజర్లను ఉపయోగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా తెలంగాణలో అదే విధంగా ఉపయోగిస్తూ బీజేపీ దారిలోనే నడుస్తున్నదని విరుచుకుపడ్డారు.
రాజ్యాంగంలో పొందుపరచిన సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను గౌరవించే విధంగా మీ పార్టీ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వమని, తద్వారా రాష్ర్టంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లేఖలో రాహుల్ని కోరారు.