28-01-2025 07:16:23 PM
బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి..
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రజాయుద్ద నౌక గద్దర్ పై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తులకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు వున్నాయని ఇది రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని అవమానించడమే అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం ఉన్న వారికే పద్మ అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో వుందా అని నిలదీశారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన అవార్డులు సంజయ్ వ్యాఖ్యల వల్ల మోదీ ప్రభుత్వాన్ని దిగ్గజార్చినట్లుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం ప్రతీఒక్కరినీ కదిలించిన వ్యక్తి గద్దర్ అని, తెలంగాణ ఉద్యమంలో బండి పాత్ర ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి స్థాయిని మరిచి గద్దర్ పై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుండి రాష్ట్రప్రతి తొలగించాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.