calender_icon.png 27 October, 2024 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలపై యాక్షన్ ప్లాన్

30-08-2024 01:00:00 AM

  1. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బలోపేతం 
  2. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుకు ఆదేశం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): రాష్ట్రంలో పదేళ్ల తర్వాత తొలిసారిగా వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొంది స్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో వరద కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ నష్టం,ఆస్తి నష్టం తగ్గించడానికి, ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థ(డిజాస్టర్ మేనేజ్‌మెంట్)ను బలోపేతం చేస్తు న్నామని వెల్లడించారు.

వరదలతో సంబం ధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా, పరి వాహక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించడానికి ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. వరదలు, కాలువలు, చిన్న డ్రైనేజీల నుంచి మొదలుకుని, హైరైజ్ భవనాల వరకు ఏ పరిస్థితి ఎదురైనా దానిని అధిగమించడానికి వీలు గా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని విభాగా లు వరద ముప్పును ఎదుర్కొవడానికి కా వాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని రా వాలని ఆదేశించారు. త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

హైడ్రాకు పూర్తి సహకారం..

హైడ్రా పరిధిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. గతంలో 30 బృందాలు ఉండగా వాటిని 70కి పెంచామని, అలాగే సిబ్బంది సంఖ్య ను 1800 నుంచి 3500 వరకు పెంచినట్టు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి హైడ్రాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, హైడ్రాకు కావాల్సిన అధునాతన పరికరాలు అందిస్తామని వెల్లడించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రెవెన్యూ జాయింట్ సెక్రటరీ హరీశ్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్, ప్లానింగ్, వాతావరణ శాఖ విభాగాల అధికారులు పాల్గొన్నారు.