హీరో సాయిదుర్గతేజ్ బలమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ తర్వాత రోహిత్ కేపీ దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను చేస్తున్నారాయన. ‘హను నిర్మాతలు కె.నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. మేకింగ్ టైటిల్ ‘ఎస్డీటీ18’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన 15 రోజుల యాక్షన్- ప్యాక్డ్ షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. తర్వాతి షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ సిద్ధమవుతోందని చిత్ర వర్గాలు తెలిపాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.