calender_icon.png 27 February, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధం తీరుమారినా.. ముగిసేది రక్తపాతంతోనే!

27-02-2025 12:00:00 AM

యంగ్ హీరో ఆకాశ్ జగన్నాథ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తల్వార్’. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈఎల్‌వీ నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు కాశీ పరశురామ్ తెరకెక్కిస్తున్నా రు. ఈయన ఇంతకు ముందు అశ్వత్థా మ, లక్ష్య సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ‘రణస్థలి’ అనే చిత్రానికి దర్శకత్వం వహిం చారు. తాజా చిత్రంలో పూరి జగన్నాథ్, ప్రకాశ్‌రాజ్, షిన్‌టామ్‌చాకో, అనసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బుధవారం మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. వాయిస్ ఓవర్‌లో ఆకాశ్ తరతరాలుగా జరుగుతున్న యుద్ధం, రక్తపాతం గురించి గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘యుద్ధం జరిగే తీరు మారినా.. చివరకు రక్తపాతంతో ముగుస్తోంది.. అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధం’ అన్న ఈ డైలాగ్ గ్లింప్స్‌కు హైలైట్. ఇటీవల షూట్ స్టార్ట్ అయిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: త్రిలోక్ సిద్ధు; మ్యూజిక్: కేశవ కిరణ్; ఎడిటర్: ఐల శ్రీనివాసరావు.