02-04-2025 12:00:00 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 1: అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రం జిన్నారంలోని సర్వేనెంబర్ ఒకటి హెచ్ఎండిఏ భూమిలో సోమ వారం రాత్రి అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తుండగా ఒక టిప్పర్ ను సీజ్ చేసినట్లు ఎస్ ఐ నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ, హెచ్ఎండిఏ భూముల నుంచి ఎలాంటి అనుమ తులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.