calender_icon.png 30 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుతంగా వ్యవహరించాలి

30-04-2025 12:32:27 AM

ఎస్పీ పరితోష్ పంకజ్ 

పటాన్ చెరు, ఏప్రిల్ 29 :జన్నారం మండల ప్రజలంతా శాంతియుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మంగళవారం ఊట్ల శివారులోని ఎన్‌ఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్ లో పీస్ కమిటీ సమావేశాన్ని జిన్నారం పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ పరతోష్ పంకజ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా ఎవరు నమ్మకూడదని, నిజానిజాలు ఏమిటో నిర్ధారించుకోవాలని సూచించారు.  శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించమని తెలిపారు. జిన్నారంలో ఇటీవల  జరిగిన ఘటనను ఊటంకిస్తూ తప్పిదాన్ని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సంజీవ్ రావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐలు నయిముద్దీన్, రవీందర్ రెడ్డి, ఎస్‌ఐ నాగలక్ష్మి, జిన్నారం మండల ప్రజలుపాల్గొన్నారు.