calender_icon.png 29 September, 2024 | 8:52 PM

రూ.30కోట్ల విలువైన భూమి స్వాధీనం

29-09-2024 02:29:40 AM

చేవెళ్ల, సెప్టెంబర్ 28: రూ.30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చెర వీడింది. మొయినాబాద్ మండలం కనకమామిడి శివారులోని సర్వే నంబర్ 510-పీ లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఆక్రమించిన కొందరు చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌ను ఏర్పాటు చేసి అందులో గదులు నిర్మిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ గౌతమ్ కుమార్ ఆదేశాలతో శుక్రవారం డిటీ సుజిత్ రెడ్డి, సర్వేయర్ జలజ విచారణ చేపట్టారు.

కొందరు ప్రభుత్వ భూమిని కబ్జాపెట్టడమే కాకుండా అందులో ప్రీకాస్ట్ వాల్ నిర్మించి.. రూములు కడుతున్నారని నిర్ధారించారు. వెంటనే తహసీల్దార్‌కు రిపోర్ట్ ఇవ్వడంతో శనివారం స్పాట్‌కు చేరుకుని ప్రీకాస్ట్ వాల్, రూమ్‌లను తొలగించారు. అనంతరం అక్కడ ప్రభుత్వ భూమిగా బోర్డు పాతారు.