09-04-2025 08:07:15 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామ శివారులో తలెత్తిన భూమి వివాదం పరిష్కారమైంది. ప్రభుత్వ భూమిపై వివాదం తలెత్తింది. రెవెన్యూ అధికారులు బుధవారం సర్వే చేశారు. అట్టి సర్వేలో 30 గుంటల భూమి ప్రభుత్వానిదని తేలిపోయింది. ఆకనపల్లి గ్రామ శివారులోసర్వే నెంబరు 64 లోని భూ వివాదంపై బెల్లంపల్లి తహసిల్దార్ జ్యోత్స్న ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. కొలతలు కొలిచి సర్వేచేశారు. ఈ సర్వేలో 30 గుంటల భూమి ప్రభుత్వందని తేలిపోయిందని తాసిల్దార్ జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు అట్టి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ స్థలాన్ని సబ్స్టేషన్ కోసం కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.