ముంబై, సెప్టెంబర్ 27: భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలుసుకుని అతడిని నిలదీయడంతో పాటు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకొని పుట్టింట్లో ఉంటున్న భార్యపై కోపం పెంచుకున్న మాజీ భర్త ఆమె మీద యాసిడ్ పోసిన అమానవీయ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని మాల్వాని ప్రాంతంలో ఓ జంట 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లున అనంతరం భర్తకు ఉద్యోగం లేకపోవడంతో పాటు డ్రగ్స్కు బానిసగా మారి.. మరో మహిళతో వివాహేతర సంబ ంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య అతడ్ని ప్రశ్నించడంతో పాటు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుంది. అనంతరం ౪ నెలలుగా మాలడ్లోని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం సదరు వ్యక్తి బలవంతంగా ఇంట్లోకి వచ్చి ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు.
తీవ్ర గాయాలైన కూతురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయా లతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.