26-01-2025 12:00:00 AM
ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేలా కృషి చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య సూచించారు. ప్రతీరోజు విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో శనివారం ఒకరోజు ఓరియంటేషన్, శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యాప్రమాణాలు మెరుగుపరచాలని, రోజువారీ నివేదికలను సమర్పించాలని సూచించారు.