calender_icon.png 28 September, 2024 | 10:57 AM

గర్భిణీ బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి: ఏసీడీపీఒ ఛాయాదేవి

05-09-2024 09:13:36 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): గర్భిణీ, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని సిద్దిపేట ఏసీడీపీఓ ఛాయాదేవి సూచించారు. గురువారం పట్టణంలోని కాలకుంట కాలనీ అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక మాసోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా పొందాలన్నారు.

మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లల్ని కేంద్రానికి పంపించాలని, అంగన్వాడి కేంద్రంలోని మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. కూరగాయలు, పండ్లు, పప్పు క్రమం తప్పకుండా పొందాలని చెప్పారు. ఆకుకూరలు తినడం వల్ల అవసరమైన క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం లభిస్తుందన్నారు. పుట్టిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు తాగించాలని చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించే పౌష్టిక మాసోత్సవాలలో గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పాల్గొని తగిన సూచనలు సలహాలు పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వప్న,  అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.