calender_icon.png 28 September, 2024 | 9:04 PM

పొక్సో కేసులో నిందితుడికి జైలు

27-09-2024 02:22:03 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 26: ప్రేమ పేరుతో మైనర్‌ను వేధించిన యువకుడిపై నమోదైన పొక్సో కేసులో.. నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. కొత్తపేటలోని అంబేద్కర్ కాలనీలో ఉంటున్న అర్రా రమేశ్ (20).. స్థానికంగా ఉంటున్న మైనర్‌ను నిత్యం వెంబడిస్తూ ప్రేమిస్తున్నా నని వేధించేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక కుటుంబ సభ్యుల సహాయంతో బాలిక ఎల్బీనగర్ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ వేశారు. ఎల్బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు కేసును విచారించి గురువారం తీర్పు వెలువరిం చింది. నిందితుడికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.7వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.లక్ష పరిహారం అందజేసింది.