బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలంలోని మాదారం టౌన్షిప్ కు చెందిన రాదండి లక్ష్మికి చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని బట్టలు వస్తువులు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు రూపాయలు లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకొన్నది. ఈ మేరకు మాదారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.