calender_icon.png 27 September, 2024 | 8:52 PM

నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

27-09-2024 05:37:35 PM

మెదక్,(విజయక్రాంతి): నర్సాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం జరిగింది. స్థానిక బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు హైదరాబాద్ నుండి నర్సాపూర్ మీదుగా కాలేజీకి చేరుకుంటాయి. అదే తరుణంలో స్టానిక్ క్లాసిక్ గార్డెన్ సమీపంలో ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ కొనడంతో ఒక బస్సుకి చెందిన డ్రైవర్ నాగరాజు(50) అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్ లో ప్రయాణిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులు సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. క్షత్రగాత్రులను హుటా హుటినా హైదరాబాదులోని పలు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.  ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో పలువురు విద్యార్థులు షాక్ కు గురయ్యారు.