calender_icon.png 28 October, 2024 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైరతాబాద్ ఫ్లుఓవర్‌పై ప్రమాదం

22-07-2024 12:36:22 AM

బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): అతివేగంగా బైక్ నడుపుతూ ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన రాజ్‌కుమార్ (18) బంజారాహిల్స్ గౌరీశంకర్ కాల నీలో నివాసముంటూ అమీర్‌పేటలోని ఓ జ్యూవెల్లరీ షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం అతని స్నేహితుడు వివేక్‌తో కలిసి ఖైరతాబాద్ ఫ్లు ఓవర్ మీదు గా ఐమాక్స్ రోటరీ చౌరస్తాకు బయలుదేరాడు. అతివేగంగా ఫ్లుఓవర్ మీదకు రాగానే వాహ నం అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా యి. వారిని అనుసరిస్తూ మరో బైక్‌పై వస్తు న్న స్నేహితుడు నితీశ్ 108కు సమాచారం అం దించగా, వారు  ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమా దంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.