అమరావతి: తిరుమల జాపాలి తీర్థంలో ప్రమాదం సంభవించింది. ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తురాలిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. కొమ్మ విరిగిపడటంతో భక్తురాలు తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన భక్తురాలిని తిరుపతి బర్డ్ ఆస్పత్రికి తరలించారు. నడుచుకుంటు వెళ్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది.