హైదరాబాద్: త్వరలో బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తామని బీసీ కమిషన్ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బీసీ కమిషన్ అర్జీలను స్వీకరిస్తోంది. రిజర్వేషన్లు పెంచితేనే న్యాయం జరుగుతోందని బీసీ సంఘాలు తెలిపాయి. అర్జీలకు పరిమితం చేయకూడదని బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు బీసీ కమిషన్ సమావేశానికి హాజరయ్యారు. అయితే, నవంబర్ 13 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ సభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది.