20-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం తన బడ్జెట్లో 6 గ్యారంటీల కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. బీసీ వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. విద్యారంగానికి మరింత నిధులు కేటాయించాల్సి ఉండేది. అన్ని రంగాల ప్రయోజనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. పరిశ్రమ రంగాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
కంచర్ల లింగం,
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా