నిజామాబాద్: పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంటిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో, మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో సోదాలు ముగిశాయి. నరేందర్ ఆదాయానికి మించి 6 కోట్ల 7 లక్షల 81 వేల అక్రమ ఆస్తులు సంపాధించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నరేందర్ ఇంట్లో 2 కోట్ల 93 లక్షల 81 వేల నగదు, అతని భార్య తల్లి అకౌంట్లో 1.10 కోట్ల నగదు డిపాజిట్లు, 51 తులాల బంగారం, కోటి 98 లక్షల విలువైన 17 స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.